పరీక్ష మూల్యాంకనంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-03-20T08:25:18+05:30 IST

కరోన వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నపోతుండగానే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మూల్యాంకనం మరొక పెద్ద విషయం. ఈ పరిస్థితుల్లో మూల్యాంకన విధానంలో...

పరీక్ష మూల్యాంకనంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి

కరోన వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నపోతుండగానే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మూల్యాంకనం మరొక పెద్ద విషయం. ఈ పరిస్థితుల్లో మూల్యాంకన విధానంలో కూడా మార్పులు చేస్తే బాగుంటుందని అధ్యాపకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో కూడా మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోవిడ్ వైరస్సును కట్టుదిట్టంగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంటర్ బోర్డు షిఫ్టు పద్ధతిలో మూల్యాంకనాలను జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇది కొంతమేర మంచి నిర్ణయమే. కానీ ఒకే ప్రదేశంలో ఎక్కువమంది అధ్యాపక సిబ్బందితో మూల్యాంకనం జరపడం వల్ల అధ్యాపకులు దూర ప్రయాణాలు చేసి రావడం తప్పదు. ఈ ప్రయాణాల కారణంగా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. మరి కొద్దిరోజుల్లో పదవ తరగతి మూల్యాంకనం కూడా ప్రారంభం కాబోతున్న వేళ మూల్యాంకన కేంద్రాల వికేంద్రీకరణ దిశగా అడుగులు పడాలి. అదే విధంగా పరీక్షా పద్ధతిలోనూ మార్పులు చెయ్యాలి. కొంతమేర ఆబ్జెక్టివ్ పద్ధతిని అనుసరించి ప్రశ్నాపత్రం రూపొందించాలి. వీలైనంత తొందరగా వికేంద్రీకరణ చేసి, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మూల్యాంకన ప్రక్రియను జాగరూకతతో నిర్వర్తించాలి. సామూహిక క్రతువుకు స్వస్తి పలకాలి.

సుంకర రమేశ్, హైదరాబాద్

Updated Date - 2020-03-20T08:25:18+05:30 IST