సౌదీలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి !
ABN , First Publish Date - 2020-05-28T15:43:02+05:30 IST
సౌదీ అరేబియాలో కాల్పులు కలకలం సృష్టించాయి.
రియాధ్: సౌదీ అరేబియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. అసిర్ రీజియన్లో యెమెనీ బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారని సౌదీ పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు సౌదీ పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్ అమ్వాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సౌదీ అరేబియా పోలీసులు వెల్లడించారు.