రాజమండ్రిలో దారుణం
ABN , First Publish Date - 2021-01-17T15:03:39+05:30 IST
మద్యం మత్తులో సతీష్ అనే యువకుడిపై ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.
రాజమండ్రి: నగరంలో దారుణం జరిగింది. ఆదెమ్మ దిబ్బ వాంబే కాలనీ దగ్గర మద్యం మత్తులో సతీష్ అనే యువకుడిపై ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సతీష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బైక్ విషయంలో మృతుడు సతీష్కు, బ్లేడ్ బ్యాచ్కు చెందిన దుర్గాప్రసాద్కు మద్య వివాదం జరిగింది. దీంతో రాత్రి దుర్గాప్రసాద్ తన స్నేహితులతో కలసి సతీష్పై కత్తులతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితులు దుర్గాప్రసాద్, పోతురాజు, పండు, సాయి, వీరబాబులుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.