అట్రాసిటీ కేసులో రావికి ఊరట

ABN , First Publish Date - 2020-12-01T09:36:07+05:30 IST

టీడీపీ గుడివాడ నియోజకవర్గం ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరావు సహా నలుగురిపై నమోదైన ఎస్సీ ఎన్టీ అట్రాసిటీ కేసులో అరె్‌స్టలు

అట్రాసిటీ కేసులో రావికి ఊరట

గుడివాడ, నవంబరు 30: టీడీపీ గుడివాడ నియోజకవర్గం ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరావు సహా నలుగురిపై నమోదైన ఎస్సీ ఎన్టీ అట్రాసిటీ కేసులో అరె్‌స్టలు చేయవద్దని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రావి తరపున న్యాయవాది కె.ఎం.కృష్ణారెడ్డి హైకోర్టులో స్వ్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. బొమ్ములూరుకు చెందిన తలారి గోపి, యంగల నాగేంద్రబాబులు రావితో పాటు ముళ్లపూడి రమేష్‌, షేక్‌ జానీ, అడుసుమిల్లి శ్రీనివా్‌సలు టిడ్కో ఇళ్ల వద్ద నిరసనలో భాగంగా తమను కులం పేరుతో దూషించారని రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. 

Updated Date - 2020-12-01T09:36:07+05:30 IST