నిడదవోలు మండలంలో మహిళపై దాడి
ABN , First Publish Date - 2021-08-04T00:32:04+05:30 IST
జిల్లాలో మహిళపై దాడి జరిగింది. నిడదవోలు (మ) సుబ్బరాజు
పశ్చిమ గోదావరి: జిల్లాలో మహిళపై దాడి జరిగింది. నిడదవోలు (మ) సుబ్బరాజు పేటలో గౌరీదేవి అనే మహిళపై సత్యనారాయణ అలియాస్ బాబ్జీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గౌరీదేవి పరిస్థితి విషమంగా ఉంది. గౌరీదేవిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం వలన వచ్చిన మనస్పర్థలతో గౌరీదేవిపై సత్యనారాయణ హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.