టిక్‌టాక్ వద్దన్నందుకు... తల్లీకొడుకులపై దాడి

ABN , First Publish Date - 2020-05-26T00:28:44+05:30 IST

టిక్‌టాక్ తీయొద్దన్నందుకు ఓ తల్లీకొడుకులపై దాడి చేశారు కొంతమంది దుండగులు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. రోడ్డు నెంబర్ 10 లో సింగాడ బస్తీలోని దోబీఘాట్‌లో నివసిస్తున్న సురేష్... సీఎం క్యాంపు కార్యాయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొందరు యువకులు తన ఇంటి ముందు టిక్‌టాక్ వీడియో తీస్తుండగా సరేష్ వారించే యత్నం చేశాడు. దీంతో సరేష్‌తో పాటు అతని తల్లి పై కూడా ఆ యువకులు దాడికి పాల్పడ్డారు. దీంతో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

టిక్‌టాక్ వద్దన్నందుకు... తల్లీకొడుకులపై దాడి

హైదరాబాద్ : టిక్‌టాక్ తీయొద్దన్నందుకు ఓ తల్లీకొడుకులపై దాడి చేశారు కొంతమంది దుండగులు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. రోడ్డు నెంబర్ 10 లో సింగాడ బస్తీలోని దోబీఘాట్‌లో నివసిస్తున్న సురేష్... సీఎం క్యాంపు కార్యాయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొందరు యువకులు తన ఇంటి ముందు టిక్‌టాక్ వీడియో తీస్తుండగా సరేష్ వారించే యత్నం చేశాడు. దీంతో సరేష్‌తో పాటు అతని తల్లి పై కూడా ఆ యువకులు దాడికి పాల్పడ్డారు. దీంతో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2020-05-26T00:28:44+05:30 IST