ఆలయాలపై దాడులు సరికాదు: చినజీయర్ స్వామి

ABN , First Publish Date - 2021-01-17T23:20:16+05:30 IST

మంత్రాలయంలో త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. ఆ పర్యటనలో మంత్రాలయం మండలం వగురూర్ గ్రామంలో రెండు నెలల క్రితం ధ్వంసమైన

ఆలయాలపై దాడులు సరికాదు: చినజీయర్ స్వామి

కర్నూలు: మంత్రాలయంలో త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. ఆ పర్యటనలో మంత్రాలయం మండలం వగురూర్ గ్రామంలో రెండు నెలల క్రితం ధ్వంసమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులకు రూ. లక్ష విరాళాన్ని చినజీయర్ స్వామి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు. ఆలయాలపై దాడులు సరికాదని చినజీయర్ స్వామి హితవుపలికారు. మంత్రాలయం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు కొత్తబస్టాండు ప్రాంతంలోని చేకూరి ఫంక్షన్‌హాల్‌లో ఆదోని మండలంలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన నిర్వాహకులతో జరిగే సమావేశంలో వారికి మార్గదర్శనం చేస్తారని నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2021-01-17T23:20:16+05:30 IST