ఆలయాలపై దాడులు దురదృష్టకరం: కోన రఘుపతి
ABN , First Publish Date - 2021-01-08T19:53:43+05:30 IST
ఆలయాలపై దాడులు దురదృష్టకరమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు.
రాజమండ్రి.: ఆలయాలపై దాడులు దురదృష్టకరమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. ఘటనలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఘటనలపై సీఎంలు బాధ్యత వహించారా అని ప్రశ్నించారు. చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు కోర్టు ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. మూడు రాజధానుల అసెంబ్లీ తీర్మానాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు. రాష్ట్రంలో ఏది జరిగిన వైసీపీ చేస్తోందని టీడీపీ నాయకులు చెపుతున్నారన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని కోన రఘుపతి మండిపడ్డారు.