గబ్బా టెస్టు: స్మిత్ ఔట్.. మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్
ABN , First Publish Date - 2021-01-15T15:09:06+05:30 IST
గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆసీస్ 87 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
బ్రిస్బెన్: గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆసీస్ 87 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(01), మార్కస్ హారిస్(05) విఫలం కావడంతో 17 పరుగులకే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికే వార్నర్ పెవిలియన్ చేరాడు. స్లిప్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో నాలుగు పరుగులకే ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ హారిస్ కేవలం 5 పరుగులు చేసి శార్ధుల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో 17 పరుగులకే ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.
అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, లుబుషేన్ జోడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో స్మిత్ 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్కు చిక్కాడు. సుందర్ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి స్మిత్ ఔటయ్యాడు. దీంతో ఈ ద్వయం 70 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. భారత బౌలర్లలో సిరాజ్, శార్ధూల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 46 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజులో లుబుషేన్(49), మాథ్యూ వేడ్(11) ఉన్నారు.