సుందర్-శార్దుల్ జోరుకు కమిన్స్ బ్రేక్
ABN , First Publish Date - 2021-01-17T17:43:18+05:30 IST
నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్తో ఆకట్టుకున్న టీమిండియా బౌలర్లు సుందర్-శార్దుల్ జోడీని ఆసీస్ బౌలర్ కమిన్స్ విడగొట్టాడు.
బ్రిస్బేన్: నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్తో ఆకట్టుకున్న టీమిండియా బౌలర్లు సుందర్-శార్దుల్ జోడీని ఆసీస్ బౌలర్ కమిన్స్ విడగొట్టాడు. సెంచరీ భాగస్వామ్యంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఇద్దరి జోరుకు జట్టు స్కోర్ 309 పరుగుల దగ్గర బ్రేక్ పడింది. 103వ ఓవర్ మూడో బంతికి కమిన్స్ బౌలింగ్లో శార్దుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శార్దుల్ 115 బంతుల్లో 67 పరుగులు చేశాడు. తన టెస్ట్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ ఇది. దీనిలో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మూడో రోజు ఆటలో శార్దుల్, సుందర్ జోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బౌలర్లే కదా ఇక ఇన్నింగ్స్ అయిపోయిందనుకున్న వారికి షాకిచ్చారు. వీలైనంత వరకు వికెట్ను కాపాడుకుంటూ, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ వైపుగా బంతిని తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. తమ కెరీర్లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడారు.