సీతారాముల కల్యాణానికి రావొద్దు
ABN , First Publish Date - 2021-04-18T05:58:40+05:30 IST
సీతారాముల కల్యాణానికి రావొద్దు
ఐనవోలు, ఏప్రిల్ 17: కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలకు భక్తు లు రావద్దని ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం ఈవో అద్దంకి నాగేశ్వర్రావు సూచించారు. మల్లికార్జునస్వామి అనుబంధ ఆలయం శ్రీ అంజనేయస్వామి దేవాలయంలో ఈ నెల 21న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించడంలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తుల గమనించి సహకరించాలని కోరారు.