మాకు 'రాజారెడ్డి' రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే...: అయ్యన్న
ABN , First Publish Date - 2020-05-31T17:07:18+05:30 IST
మాకు 'రాజారెడ్డి' రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే...: అయ్యన్న
విజయవాడ: వైసీపీ ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే గౌరవం లేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వానికి చట్టాలంటే విలువ లేదన్నారు. హైకోర్టు తీర్పుని తూర్పార పడుతూ అర్ధరాత్రి జీవోలు ఇచ్చి రాజ్యాంగానికి, చట్టానికి అతీతుడినని జగన్ ప్రకటించుకున్నారని చెప్పారు. ప్రజలు కూడా మాకు 'రాజారెడ్డి' రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే...మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్క సారి ఆలోచించుకోండన్నారు. ఇప్పటికైనా రాజ్యాంగం, చట్టాల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.