ఏపీని అసమర్థ సీఎం పాలిస్తున్నారు: అయ్యన్నపాత్రుడు
ABN , First Publish Date - 2021-09-16T23:02:53+05:30 IST
ఏపీని అసమర్థ సీఎం పాలిస్తున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ఏపీని అసమర్థ సీఎం పాలిస్తున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మద్యం, మాంసం, చేపలు అమ్ముతారా? అని ప్రశ్నించారు. చేతకానివారు పాలన చేస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవాచేశారు. సన్న బియ్యం అంటే తెలియనివారు పౌర సరఫరాల మంత్రి అని తప్పుబట్టారు. బెట్టింగ్ రాయుడు ఇరిగేషన్ మంత్రి అయ్యరని దుయ్యబట్టారు. లేని దిశ చట్టంతో శిక్షలు వేశామని హోంమంత్రి సుచరిత గొప్పలు చెబుతున్నారని, తక్షణమే హోంమంత్రి రాజీనామా చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.