హైదరాబాద్‌కు ఆ సత్తా ఉంది

ABN , First Publish Date - 2021-03-02T06:53:56+05:30 IST

ఉప్పల్‌ మైదానంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తిపై హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్‌ స్పందించాడు...

హైదరాబాద్‌కు ఆ సత్తా ఉంది

  • కేటీఆర్‌ ట్వీట్‌కు అజ్జూ మద్దతు


హైదరాబాద్‌: ఉప్పల్‌ మైదానంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తిపై హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్‌ స్పందించాడు. ఈ విషయంలో ఆయనకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు తెలిపాడు. ఈ సీజన్‌ను కేవలం ఆరు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోగా.. అందులో హైదరాబాద్‌ను కూడా చేర్చాలంటూ కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా బోర్డును కోరారు. అటు మ్యాచ్‌లను నిర్వహించే సత్తా తమకుందని టీమిండియా మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌ చెప్పాడు. ‘కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తికి గట్టి మద్దతిస్తున్నా. బీసీసీఐ సూచనలు పాటిస్తూ బయోబబుల్‌ను సమర్థవంతంగా నిర్వహించే సత్తా హైదరాబాద్‌కు ఉంది’ అని అజ్జూ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2021-03-02T06:53:56+05:30 IST