బాబాయ్ హంతకులను తేల్చలేదేం: ఉమా
ABN , First Publish Date - 2021-01-17T08:39:15+05:30 IST
‘‘మొదట బాబాయికి గుండె పోటన్నారు. గాయాలెలా అయ్యాయంటే హత్య అన్నారు. సీబీఐ విచారణ కావాలన్నారు.
జి.కొండూరు, జనవరి 16: ‘‘మొదట బాబాయికి గుండె పోటన్నారు. గాయాలెలా అయ్యాయంటే హత్య అన్నారు. సీబీఐ విచారణ కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ వద్దన్నారు. ప్రత్యక్ష సాక్షులు గుండెపోటుతో పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతకీ బాబాయ్ని ఎవరు చంపారో 20 నెలలైనా ఎందుకు తేల్చడం లేదు?’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్లో సీఎం జగన్ను ఎద్దేవా చేశారు.