విరాట్‌తో కాదు..పాక్‌ దిగ్గజాలతో పోల్చండి

ABN , First Publish Date - 2020-07-04T08:39:32+05:30 IST

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కాకుండా పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాళ్లతో తనను పోల్చితే సంతోషిస్తానని పాక్‌ వన్డే జట్టు సారథి బాబర్‌ ఆజమ్‌ అన్నాడు...

విరాట్‌తో కాదు..పాక్‌ దిగ్గజాలతో పోల్చండి

కరాచీ: భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కాకుండా పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాళ్లతో తనను పోల్చితే సంతోషిస్తానని పాక్‌ వన్డే జట్టు సారథి బాబర్‌ ఆజమ్‌ అన్నాడు. భవిష్యత్‌లో కోహ్లీని అధిగమించే సత్తా బాబర్‌ ఆజమ్‌కు ఉందంటూ కొంతకాలంగా పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై బాబర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎవరితోనైనా నన్ను పోల్చాలనుకుంటే పాక్‌ ఆటగాళ్లతో పోల్చండి. మాకు మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, ఇంజమామ్‌వంటి దిగ్గజ ఆటగాళ్లున్నారు. నేను సాధించిన ఘనతలను వీరితో సరిపోల్చితే చాలా సంతోషిస్తాను’ అని టీ20ల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ తెలిపాడు.

Updated Date - 2020-07-04T08:39:32+05:30 IST