బాబు ఆస్తుల కేసు నవంబరు 24కు వాయిదా

ABN , First Publish Date - 2020-10-22T09:46:24+05:30 IST

బాబు ఆస్తుల కేసు నవంబరు 24కు వాయిదా

బాబు ఆస్తుల కేసు నవంబరు 24కు వాయిదా

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన ఆస్తుల కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు నవంబరు 24కు వాయిదా వేసింది. చంద్రబాబు ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో 2005లో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్టే ఎత్తివేయడంతో తిరిగి విచారణ మొదలైంది.

Updated Date - 2020-10-22T09:46:24+05:30 IST