పట్టాభికి బెయిల్
ABN , First Publish Date - 2021-10-23T21:23:48+05:30 IST
టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరైంది. ఈ రోజు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు
అమరావతి: టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరైంది. ఈ రోజు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభికి బెయిల్ రావడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.