అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం

ABN , First Publish Date - 2021-06-12T01:46:07+05:30 IST

వంశీగ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్, శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో 75వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులు 75 పాటలతో బాలు పాటకు పట్టాభి

అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం

వాషింగ్టన్: వంశీగ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్, శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో 75వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులు 75 పాటలతో బాలు పాటకు పట్టాభిషేకం చేయబోతున్నారు. భారత కాలమానం ప్రకారం జూన్ 13న సాయంత్రం 6 గంటలకు టెక్సాస్/హ్యూస్టన్‌ వేదికగా జరగనుంది. అంతర్జాలం ద్వారా ప్రముఖ గాయని, అమెరికా గానకోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు, మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర, సిరాశ్రీ రవిప్రకాష్, యూకే నుంచి డా నగేష్ చెన్నుపాటి ,సురేష్ కొండేటి, ఒమన్ నుంచి అనిల్ కుమార్ కడించెర్ల, హరి వేణుగోపాల్ ముఖ్య అతిథిలుగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గాయకులు రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం శ్రీ సాందీప్. పవన్ చరణ్, హరి గుంట, విపంచి శశిధర్, ధనుంజయ్ బాలుకు సంబంధించిన 75  పాటలను పాడి వీనులవిందు చేయనున్నారు. 




Updated Date - 2021-06-12T01:46:07+05:30 IST