టాస్ గెలిచిన ఆర్సీబీ.. షాకిచ్చిన కోల్‌కతా

ABN , First Publish Date - 2021-04-18T21:06:04+05:30 IST

చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది.

టాస్ గెలిచిన ఆర్సీబీ.. షాకిచ్చిన కోల్‌కతా

చెన్నై: చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్ రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ పెలిలియన్ చేరాడు.  ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. దీంతో జట్టు స్కోర్ ఆరు పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కాసేపటికే మరో వికెట్ చేజార్చుకుంది. ఓవర్ చివరి బంతికి పాటిదర్ ఔట్ అయ్యాడు. దీంతో తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ... బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఇది పదో మ్యాచ్. 

Updated Date - 2021-04-18T21:06:04+05:30 IST