మూడు మెగా టోర్నీలకు బీసీసీఐ బిడ్
ABN , First Publish Date - 2021-06-21T10:57:59+05:30 IST
ఐసీసీ నిర్వహించే మరో మూడు మెగా టోర్నీలకు బిడ్డింగ్ వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో..
న్యూఢిల్లీ: ఐసీసీ నిర్వహించే మరో మూడు మెగా టోర్నీలకు బిడ్డింగ్ వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో..2024లో మొదలయ్యే ఎనిమిదేళ్ల టోర్నీల షెడ్యూల్లోని రెండు వరల్డ్ కప్లున్నాయి. ఈమేరకు ఆదివారం వర్చువల్గా జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ (2025), టీ20 (2028), వన్డే ప్రపంచ కప్ (2031)ల ఆతిథ్య హక్కులకు పోటీపడాలని బీసీసీఐ భావిస్తోంది.
టోక్యో అథ్లెట్లకు రూ. 10 కోట్లు
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు బీసీసీఐ రూ. 10 కోట్ల సాయం అందించనుంది. ఈ మేరకు బోర్డు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.