బీజేపీ ఆఫీసులకు నేడు భూమిపూజ

ABN , First Publish Date - 2020-08-09T07:50:09+05:30 IST

9 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన భూమి పూజ ఆదివారం జరగనుంది. డిజిటల్‌ వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు...

బీజేపీ ఆఫీసులకు నేడు భూమిపూజ

9 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి బీజేపీ శ్రీకారం చుట్టింది.  ఇందుకు సంబంధించిన భూమి పూజ ఆదివారం జరగనుంది. డిజిటల్‌ వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌, కొమ్రంభీం ఆసిఫాబాద్‌, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించనున్నారు.

Updated Date - 2020-08-09T07:50:09+05:30 IST