సంకల్బాగ్ పుష్కరఘాట్ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-11-22T17:42:11+05:30 IST
సంకల్బాగ్ పుష్కరఘాట్ వద్ద ఉద్రిక్తత
కర్నూలు: సంకల్బాగ్ పుష్కరఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చలో తుంగభద్రకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పుష్కర స్నానాలకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, వీహెచ్పీ, భజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.