అయోమయంలో బీజేపీ.. సాగర్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు!

ABN , First Publish Date - 2021-03-30T00:27:21+05:30 IST

అయోమయంలో బీజేపీ.. సాగర్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు!

అయోమయంలో బీజేపీ.. సాగర్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు!

నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. టీఆర్ఎస్ అసంతృప్తులు వస్తారని బీజేపీ భావించింది. తేరా చిన్నపురెడ్డి, కోటిరెడ్డి‌కి టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోతే కాషాయ కండువా కప్పుకుంటారని బీజేపీ నేతలు అంచనా వేశారు. ఈ ఇద్దరికీ టీఆర్ఎస్ బాస్ హామీ ఇచ్చి బుజ్జగించారు. దీంతో వాళ్లు బీజేపీలో చేరేందుకు వెనక్కి తగ్గారు. అయితే కొంతమంది పేర్లను హైకమాండ్‌కు పంపామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆశావహులు ఇప్పటికే సాగర్‌లో ప్రచారం ప్రారంభించేశారు. కానీ వీరికి బీజేపీ అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. దీంతో అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక రాష్ట్ర పార్టీ పంపిన జాబితాను అధిష్టానం పరిశీలించి బలమైన నాయకుడిని సాగర్ బరిలో దింపుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

Updated Date - 2021-03-30T00:27:21+05:30 IST