బీజేపీ అసత్య ప్రచారం : ఇందిరా శోభన్‌

ABN , First Publish Date - 2021-06-25T10:16:46+05:30 IST

వైఎస్‌ షర్మిల, మంత్రి కేటీఆర్‌ ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందని షర్మిల అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ అన్నారు.

బీజేపీ అసత్య ప్రచారం : ఇందిరా శోభన్‌

నేడు కరీంనగర్‌ జిల్లాలో షర్మిల పర్యటన

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ షర్మిల, మంత్రి కేటీఆర్‌ ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందని షర్మిల అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ అన్నారు. కూకట్‌పల్లి, ఇల్లందు, సాగర్‌ ప్రాంతాల్లో ఉన్న బీజేపీ సానుభూతిపరులు ఈ ప్రచారాలు చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గురువారం ఇందిర మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని అల్మా్‌సపూర్‌ గ్రామాన్ని శుక్రవారం షర్మిల సందర్శిస్తారని, కరోనాతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. చేనేత కార్మికులను కూడా కలుస్తారని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-25T10:16:46+05:30 IST