బీజేపీకి బెంగాల్ నుంచి సైద్ధాంతిక శక్తి : మోదీ

ABN , First Publish Date - 2021-04-10T22:33:11+05:30 IST

భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక శక్తిని పశ్చిమ బెంగాల్ నుంచి పొందుతోందని

బీజేపీకి బెంగాల్ నుంచి సైద్ధాంతిక శక్తి : మోదీ

కోల్‌కతా : భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక శక్తిని పశ్చిమ బెంగాల్ నుంచి పొందుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా కృష్ణా నగర్‌లో శనివారం జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇక్కడి ప్రతి అణువులోనూ తమ విశ్వాసం, తాత్వికత, ఆధ్యాత్మికతలకు సంబంధించిన కథలు ఉన్నాయన్నారు. ఈ గడ్డ నుంచి సైద్ధాంతిక శక్తిని పొందుతున్న ఏకైక పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. 


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశీర్వాదాలతో బీజేపీ మనుగడలోకి వచ్చిందన్నారు. బెంగాల్‌కు సేవ చేసే అవకాశాన్ని బెంగాలీలు బీజేపీకి ఇవ్వబోతున్నారని, ఇది బీజేపీ అదృష్టమని చెప్పారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ శనివారం జరుగుతోంది. 44 శాసన సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29న చివరి, ఎనిమిదో విడత పోలింగ్ జరుగుతుంది. మే రెండున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2021-04-10T22:33:11+05:30 IST