ఆడపిల్లలకు రక్షణ లేదు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-09-17T09:02:57+05:30 IST

తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత చిన్నారి కుటుంబాన్ని

ఆడపిల్లలకు రక్షణ లేదు: విజయశాంతి

సైదాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేత విజయశాంతి  ఆరోపించారు. సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత చిన్నారి కుటుంబాన్ని ఆమె గురువారం పరామర్శించారు. నగరంలో దారుణ ఘటన జరిగినా ముఖ్యమంత్రి ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని చెప్పారు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల రక్షణపై ప్రధాని మోదీతో మాట్లాడతానని చెప్పారు.

Updated Date - 2021-09-17T09:02:57+05:30 IST