బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జిల్లా నేతలు

ABN , First Publish Date - 2021-01-18T04:51:27+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జిల్లా నేతలు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జిల్లా నేతలు

హన్మకొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసమావేశానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి బీజేపీ నేతలు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిని వివరించారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలపై నివేదిక అందజేశారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ అనుసరించనున్న వ్యూహాల గురించి రాష్ట్ర నేతలతో పంచుకున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై రాష్ట్ర నేతలు దశదిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్‌, రత్నం సతీ్‌షషా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T04:51:27+05:30 IST