శ్రీని కుమార్తెకు ‘బోర్డు’ నోటీసు
ABN , First Publish Date - 2020-12-12T10:09:15+05:30 IST
పరస్పర విరుద్ధ ప్రయోజనం అంశానికి సంబంధించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్కు బోర్డు ఎథిక్స్ ఆఫీసర్ నోటీసు జారీ చేశారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు
ముంబై: పరస్పర విరుద్ధ ప్రయోజనం అంశానికి సంబంధించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్కు బోర్డు ఎథిక్స్ ఆఫీసర్ నోటీసు జారీ చేశారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదుపై ఎథిక్స్ అధికారి, రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ శుక్రవారం నోటీసు జారీ చేశారు. తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన రూప..ఇండియా సిమెంట్స్లో డైరెక్టర్ పదవితోపాటు చెన్నై సూపర్ కింగ్స్కు యజమానిగానూ వ్యవహరిస్తున్నారని, ఇది విరుద్ధ ప్రయోజనమేనని గుప్తా ఫిర్యాదు చేశారు.