గుడిలో చోరీ.. సీసీ కెమెరాల్లో రికార్డ్

ABN , First Publish Date - 2020-05-28T23:27:47+05:30 IST

మంతన్‌గౌరిల్లిలోని మంత్రాల ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది. నలుగురు బాలురు హుండీని పగులగొట్టి నగదు ..

గుడిలో చోరీ.. సీసీ కెమెరాల్లో రికార్డ్

రంగారెడ్డి: మంతన్‌గౌరిల్లిలోని మంత్రాల ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది. నలుగురు బాలురు హుండీని పగులగొట్టి నగదు చోరీ ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గుడి బయట ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు. అయితే లోపల ఉన్న కెమెరాలో హుండీ పగులగొట్టిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. చోరీకి పాల్పడ్డ వారు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారై ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామాస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2020-05-28T23:27:47+05:30 IST