విజయవాడలో విరిగిపడిన కొండచరియలు
ABN , First Publish Date - 2020-10-13T19:31:13+05:30 IST
భారీ వర్షాలకు విజయవాడలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
విజయవాడ: భారీ వర్షాలకు విజయవాడలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో టోల్గేట్ నుంచి వచ్చే వాహనాలు నిలిపివేశారు. విద్యాధరపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. కుమ్మరిపాలెంలో కూడా కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.