దశాబ్ద గరిష్ఠ స్థాయికి వ్యాపార విశ్వాసం
ABN , First Publish Date - 2021-03-07T06:11:18+05:30 IST
భారత పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం మరింత మెరుగైందని ప్రముఖ వాణిజ్య మండలి ఫిక్కీ తాజా విడత సర్వే నివేదిక వెల్లడించింది
ఫిక్కీ బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ @74.2
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం మరింత మెరుగైందని ప్రముఖ వాణిజ్య మండలి ఫిక్కీ తాజా విడత సర్వే నివేదిక వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై వారి అభిప్రాయంతోపాటు భవిష్యత్ అంచనాలూ మెరుగయ్యాయని రిపోర్టులో పేర్కొంది. దాంతో మొత్తంగా వ్యాపార విశ్వాస సూచీ దశాబ్ద గరిష్ఠ స్థాయి 74.2కు ఎగబాకిందని ఫిక్కీ తెలిపింది. గత విడత సర్వేలో ఈ సూచీ 70.9గా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలానికి 59.0గా ఉంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతోపాటు బడ్జెట్ 2021-22 ప్రకటనలు పారిశ్రామిక వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపాయని నివేదిక పేర్కొంది.