జాతీయస్థాయి పోటీల్లో బటర్‌ఫ్లై విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-12-07T05:31:38+05:30 IST

జాతీయస్థాయి పోటీల్లో బటర్‌ఫ్లై విద్యార్థుల ప్రతిభ

జాతీయస్థాయి పోటీల్లో బటర్‌ఫ్లై విద్యార్థుల ప్రతిభ
ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న స్కూల్‌ కోఫౌండర్‌ రమేశ్‌, ఉపాధ్యాయులు

కడ్తాల్‌: జాతీయస్థాయి టగ్‌ఆఫ్‌ వార్‌ పోటీల్లో కడ్తాల మండల కేంద్రంలోని పార్చ్యూన్‌ బటర్‌ఫ్లై పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మహారాష్ట్రలో వారం రోజుల పాటు నిర్వహించిన ఈపోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు నమ్రత, బెల్సి, జీవితలు సిల్వర్‌ మెడల్స్‌ను సాధించారు. వారిని పాఠశాల ఆవరణలో  సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్‌ శేషగిరిరావు, కో-ఫౌండర్‌ రమేశ్‌ విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్‌ నాంపల్లి పాల్గొన్నారు. విద్యార్థులను జాతీయ పోటీలకు తీర్చిదిద్దిన పీఈటీలను వారు అభినందించారు. 

Updated Date - 2021-12-07T05:31:38+05:30 IST