ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2022-05-01T06:12:32+05:30 IST
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
వికారాబాద్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఈ పరీక్షకు 1,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1336 మంది హాజరయ్యారు. 515 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు 9 సెంటర్లను ఏర్పాటు చేశారు. కొన్ని పరీక్షా కేంద్రాలను డీఈవో రేణుకాదేవి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ప్రభు తనిఖీ చేశారు.