కృష్ణాజిల్లాలో 50వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-30T20:11:44+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణాజిల్లాలో సోమవారం ఒక్కరోజే 110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 50వేల కేసులు దాటాయి. కరోనా సెకండ్ వేవ్ బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, యువత ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సచివాలయాల్లో కరోనా వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.