వివేకా హత్య కేసులో ఇద్దరి విచారణ
ABN , First Publish Date - 2021-09-06T08:42:18+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 91 రోజులుగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో...

కడప క్రైం, సెప్టెంబరు 5: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 91 రోజులుగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఆదివారం మరో ఇద్దరిని విచారించారు. పులివెందుల మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, తొండూరు మాజీ జడ్పీటీసీ సభ్యుడు శివమోహన్రెడ్డిలను ఉదయం పిలిపించి సుధీర్ఘంగా విచారించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రెండు నెలల క్రితం ఆయన ఎవరెవరితో మాట్లాడారన్న విషయంపై ఫోన్ కాల్డేటా ఆధారంగా వారిని పిలిపించి విచారిస్తున్నట్లు సమాచారం.