అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-06-04T09:18:11+05:30 IST

ఈ ఏడాది క్రీడా పురస్కారాల కోసం అర్హులైన అథ్లెట్లు దరఖాస్తులను పంపేందుకు గడువు తేదీని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ పెంచింది...

అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

న్యూఢిల్లీ: ఈ ఏడాది క్రీడా పురస్కారాల కోసం అర్హులైన అథ్లెట్లు దరఖాస్తులను పంపేందుకు గడువు తేదీని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ పెంచింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదీ బుధవారం (జూన్‌ 3)తో ముగిసింది. అయితే, కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ గడువు తేదీని ఈనెల 22 వరకు పెంచుతున్నట్టు క్రీడాశాఖ బుధవారం ప్రకటించింది. అలాగే.. సమాఖ్యల నుంచి సిఫారసు లేకుండా సొంతంగా తమ పేర్లను ప్రతిపాదించుకునేందుకు కూడా అథ్లెట్లకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.

Updated Date - 2020-06-04T09:18:11+05:30 IST