అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ABN , First Publish Date - 2021-10-24T04:16:37+05:30 IST
అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
మహేశ్వరం : మండల పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి శనివారం కేంద్ర అధికారుల బృందం హర్షగూడ గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నెహ్రూ ఆధ్వర్యంలో గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా జరుగుతున్న పనులను పరిశీలించారు. జిల్లా అడిషనల్ పీడీ బి.నీరజ ప్రజల సమన్వయంతో జరుగుతున్న పనులను కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం పల్లె ప్రకృతివనాలు, స్మశానవాటికలు, డంపింగ్యార్డు పనులు, పావలా వడ్డీకి రుణాల మంజూరు, చెల్లింపు విధానం గురించి కేంద్ర బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నర్సింహులు, ఎంపీవో రవిందర్రెడ్డి, ఏఈ అనిల్కుమార్, ఏపీఎం సత్యనారాయణ, ఏపీవో తిరుపతిచారి, సర్పంచ్ పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.