పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు పెంచాలి: చాడ
ABN , First Publish Date - 2021-05-10T13:01:45+05:30 IST
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అన్ని దవాఖానాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అన్ని దవాఖానాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలన్నారు. తక్షణమే మండల, గ్రామ స్థాయిల్లో విస్తృతంగా ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి భయాందోళనలతో ఉన్న ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.