చాహల్, గౌతమ్కు కరోనా
ABN , First Publish Date - 2021-07-31T08:54:20+05:30 IST
లెగ్స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, స్పిన్ బౌలర్ కృష్ణప్ప గౌతమ్ కరోనా బారినపడ్డారు.
కొలంబో: లెగ్స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, స్పిన్ బౌలర్ కృష్ణప్ప గౌతమ్ కరోనా బారినపడ్డారు. శ్రీలంక పర్యటన సందర్భంగా నాలుగు రోజుల కిందట కరోనా పాజిటివ్గా తేలిన క్రునాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిదిమంది ఆటగాళ్లలో చాహల్, గౌతమ్ కూడా ఉన్నారు. దాంతో క్రునాల్తోపాటు, చాహల్, గౌతమ్ కొలంబోలోనే ఉండిపోయారు. మిగిలిన ఆరుగురిలో నలుగురు.. హార్దిక్, మనీష్ పాండే, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్ భారత్ చేరుకున్నారు. ఇక.. మిగిలిన ఇద్దరు..ఇంగ్లండ్లోని భారత జట్టుకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్ కూడా కొలంబోలోనే క్వారంటైన్ పూర్తిచేసుకొని అక్కడనుంచే లండన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.