సైబర్ దాడుల వల్ల యుద్ధాలు జరగొచ్చు: చైనా, రష్యాకు బైడెన్ హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-07-29T10:41:26+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. చైనా, రష్యాలకు హెచ్చరికలు చేశారు. యూఎస్‌లోని పలు

సైబర్ దాడుల వల్ల యుద్ధాలు జరగొచ్చు: చైనా, రష్యాకు బైడెన్ హెచ్చరిక!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. చైనా, రష్యాలకు హెచ్చరికలు చేశారు. యూఎస్‌లోని పలు సంస్థలపై సైబర్ దాడులు జరిగాయని, వాటిని రష్యా, చైనా దేశాలే చేశాయని ఆరోపణలు వస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి సైబర్ దాడులు బలమైన శక్తితో నిజమైన యుద్ధాలకు దారితీస్తాయంటూ పరోక్షంగా చైనా, రష్యాలకు వార్నింగ్ ఇచ్చారు. దేశంపై జరిగే ఒక సైబర్ దాడి వల్లే ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని బైడెన్ చెప్పారు. ఈ క్రమంలోనే అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల పనితీరును మెచ్చుకున్న ఆయన.. ‘‘మీ పనిని నేనెప్పుడూ రాజకీయం చేయను’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-29T10:41:26+05:30 IST