టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-06-02T00:08:39+05:30 IST
టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పొన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్: టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పొన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. మహిళలపైనా వైసీపీ అరాచకశక్తులు దాడులకు తెగబడ్డాయని, ఏడాదిగా బీసీలు, దళితులపై దాడులు శృతిమించిపోయాయని తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని, భూములు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.