వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-08T20:14:22+05:30 IST

వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉందని...

వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువు: చంద్రబాబు

తిరుపతి: వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్యకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వర్ల రామయ్య కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వేధిస్తారా? అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-04-08T20:14:22+05:30 IST