ఏపీలో అరాచకపాలన కొనసాగుతోంది: బాబు

ABN , First Publish Date - 2020-05-28T20:44:00+05:30 IST

ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

ఏపీలో అరాచకపాలన కొనసాగుతోంది: బాబు

అమరావతి: ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో పార్టీ నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై దాడులు చేస్తూ.. కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న తటస్తులపై కూడా కేసులు పెడుతున్నారని విమర్శించారు. తమషా రాజకీయాలు చేయోద్దని సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని, తాను కూడా శాశ్వతంగా ఉండాలని అనుకున్నామని, కానీ ప్రతిపక్షంలోకి వచ్చామన్నారు.


టీడీపీ మళ్లీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎక్కువ సమయం పట్టదని, వడ్డీతోసహా తీర్చుకునే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు. పత్రికలు, ప్రతిపక్షాలపై దాడులు మానాలన్నారు. ఇప్పుడు చేస్తున్న అక్రమ కేసులకు భవిష్యత్తులో జవాబుదారీతనంగా ఉండాల్సి వస్తోందన్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని పోలీసు వ్యవస్థను కూడా చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2020-05-28T20:44:00+05:30 IST