జగన్ ఏడాది పాలనపై మండిపడ్డ చంద్రబాబు
ABN , First Publish Date - 2020-06-02T00:48:17+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో అందరికీ వేదననే మిగిలిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చేతకానితనం, మోసపూరిత మనస్తత్వం, మొండితనం
హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో అందరికీ వేదననే మిగిలిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చేతకానితనం, మోసపూరిత మనస్తత్వం, మొండితనం, నా మాటే చెల్లాలనే మూర్ఖత్వంలో కలగలిసినదే వైసీపీ ఏడాది పాలన అని ఆయన ట్వీట్ చేశారు. అన్నివర్గాల వారినీ మోసం చేసారని, దారుణంగా వేధించారని మండిపడ్డారు. వైసీపీ చేసిన మోసానికి బీసీలు స్థానిక ఎన్నికల్లో ఏకంగా 10 శాతం రిజర్వేషన్లను పోగొట్టుకున్నారని చెప్పారు. బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. మండలి చైర్మన్ షరీఫ్, డాక్టర్ సుధాకర్ల ఘటనలే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.