టీడీపీ కార్యకర్త అరెస్ట్పై చంద్రబాబు ఫైర్
ABN , First Publish Date - 2020-08-11T23:28:48+05:30 IST
టీడీపీ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. చంద్రగిరిలో టీడీపీ కార్యకర్త
అమరావతి: టీడీపీ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. చంద్రగిరిలో టీడీపీ కార్యకర్త రాకేశ్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గతంలో సోషల్ మీడియాలో వైసీపీపై పోస్టు పెట్టాడన్న అక్కసుతో కుట్రలు చేశారని ఆరోపించారు. పక్క ఇంటి వాళ్లతో తప్పుడు ఫిర్యాదు చేయించి రాకేశ్ను అరెస్ట్ చేయించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త రాకేశ్పై కేసు పెట్టిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని చంద్రబాబు కోరారు.