డీజీపీ సవాంగ్కు చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2021-12-24T21:17:37+05:30 IST
పీ డీజీపీ సవాంగ్కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం లేఖ రాశారు.
అమరావతి:ఏపీ డీజీపీ సవాంగ్కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం లేఖ రాశారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై వైసీపీ గూండాల దాడిని ఖండించారు.ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. ఈనెల 20న కుప్పంలో మురళిని వైసీపీ రౌడీలు కిడ్నాప్ చేసి.. రెస్కో చైర్మన్ జీఎస్ సెంథిల్కుమార్ ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. సెంథిల్కుమార్, అనుచరులు మురళిపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారన్నారు.మురళి చేత హెచ్ఎం మురుగేష్ గురించి బలవంతంగా వాంగ్మూలం చెప్పించి వీడియో రికార్డ్ చేశారని మండిపడ్డారు. ఆ తర్వాత మురళిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టారన్నారు. తనను కిడ్నాప్ చేసి దాడి చేసినట్టు ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని మురళిని బెదిరించారని చంద్రబాబు చెప్పారు.మురళి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతనని అన్నారు. మురళికి పోలీసులు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీ సవాంగ్ని లేఖలో కోరారు.