జగన్కు చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2020-04-02T22:29:45+05:30 IST
సీఎం జగన్కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ఆయన హితవుపలికారు. కరోనా నివారణను సవాల్గా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు.
అమరావతి: సీఎం జగన్కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ఆయన హితవుపలికారు. కరోనా నివారణను సవాల్గా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ల్యాబ్లు పెంచాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులు ఉండకుండా.. అన్న క్యాంటీన్లు తెరిచి వారిని ఆదుకోవాలన్నారు. పాజిటివ్ కేసులను దాచిపెడుతున్నారన్న ప్రచారం ఉందని, స్థానిక వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిదికాదని హితవుపలికారు. ఓ వైపు ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలని చెబుతూనే.. రేషన్ పేరుతో జనాల్ని ఒకేచోటుకు చేర్చడం సరికాదన్నారు. వైద్యలు, సిబ్బందికి పీపీఈలు అందజేయాలని, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదని చంద్రబాబు చెప్పారు.