డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
ABN , First Publish Date - 2021-04-08T00:31:09+05:30 IST
డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గం పేటగుట్టలో సుబ్రమణ్యస్వామి విగ్రహాల ధ్వంసంపై ఫిర్యాదు చేశారు.
అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గం పేటగుట్టలో సుబ్రమణ్యస్వామి విగ్రహాల ధ్వంసంపై ఫిర్యాదు చేశారు. జూన్ 2019 నుండి రాష్ట్రంలో ప్రార్ధనా స్థలాలపై దాడులు పెరిగాయని తెలిపారు. ప్రభుత్వ ఉదాసీనతతో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని దుయ్యబట్టారు. నేరస్తుల్ని పట్టుకోకుండా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని చెప్పారు. పరిస్థితి తెలుసుకునేందుకు పీఎస్కు వెళ్తే కేసులు పెట్టారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో పలువురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు కార్యదర్శి మనోహర్తో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు. బేట గుట్టపై విగ్రహాల ధ్వంసం కేసులో విచారణ కోసం.. టీడీపీ నేతలను పోలీస్స్టేషన్కు తరలించారు. విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నేతలపై కుప్పం పోలీసులు కేసు పెట్టారు.