టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటి
ABN , First Publish Date - 2021-10-23T17:40:44+05:30 IST
పార్టీకి చెందిన ముఖ్య నేతలతో తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు భేటి అయ్యారు. ఈ సమావేశానికి హాజరు అయిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమలతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
అమరావతి : పార్టీకి చెందిన ముఖ్య నేతలతో తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు భేటి అయ్యారు. ఈ సమావేశానికి హాజరు అయిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమలతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటి అయినట్టు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతితో పాటు ఇంకా ఎవరెవరిని కలవాలి అనే దానిపై నేతలతో చర్చిస్తున్నారు. ఆర్టికల్ 356 ప్రవేశ పెట్టాలని ఇప్పటికే టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై గవర్నర్ను సైతం టీడీపీ నేతలు కలిశారు. రేపు రాష్ట్రపతితో భేటీలోనూ ఆర్టికల్ 356 అంశం మరోసారి చర్చకు రానుంది. రాష్ట్రపతితో పాటు మరికొందరు కేంద్ర పెద్దలను కలిసే యోచనలో టీడీపీ ఉంది.